సీఎం కేసీఆర్ తర్వాత సీనియర్ నేతను నేనే – ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ మధ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు వేదికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య సిట్టింగ్ ఎమ్మెల్యేల ఫై పలు వ్యాఖ్యలు చేయగా..తాజాగా సీఎం కేసీఆర్ తర్వాత ఎంత సీనియర్ నేత ను నేనే అని , వరుసగా 30 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నానని చెప్పుకొచ్చారు. వరంగల్‍ జిల్లా పర్వతగిరి మండల కేంద్రం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో నిర్వహించిన 1987-88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరు ఏ రంగంలో రాణించాలి అన్నా కృషి, పట్టుదల రెండు అవసరమని పేర్కొన్న ఎర్రబెల్లి తను స్కూల్లో చదువుకున్న రోజుల్లో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆటల్లో కూడా ఎప్పుడు తాను ముందుండే వాడినని, ఎన్నో బహుమతులను గెలుచుకునే వాడినని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. రాజకీయాలలోకి తన తండ్రి ప్రోత్సాహంతో వచ్చానని, రాజకీయాలలో విజయం సాధించాలన్న కసితో, పట్టుదలతో తాను నేడు ఈ స్థాయికి వచ్చానని చెప్పారు.

గతంలో ఎమ్మెల్యే కంటే పెద్ద పదవిగా భావించే ‘సమితి ప్రెసిడెంట్‍’ పదవికి తన తండ్రి పోటీ చేశారని, కాంగ్రెస్‍ పార్టీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మరో వర్గంతో తన తండ్రిని ఓడించిందని అన్నారు. అలా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో, కక్ష సాధించాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.

తాను టీడీపీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్‍ పార్టీని ఓడించినట్లు చెప్పారు. కసి ఉండడం వల్లే తాను ఎన్నికల్లో ఏడుసార్లు గెలిచానని.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మరోసారి ఎంపీగా పనిచేశానని తెలిపారు. అప్పట్లో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు ఉండేవని, వాలీబాల్‍, కబడ్డీ, స్విమ్మింగ్‍ ఇలా మొత్తం అన్ని ఆటల్లోనూ తానే ఫస్ట్ ప్రైజ్‍లు గెలుచుకునే వాడినని చెప్పారు.

తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తానే సీనియర్ అని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అన్నారు. ఒకసారి ఎంపీగా గెలిచానని ప్రస్తుతం రాజకీయాలలో రాణిస్తున్నానని, ప్రజల ఆదరణ, అభిమానం కారణంగా గత 30 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉన్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.