వుహాన్ ల్యాబ్ నుంచే ‘మహమ్మారి’ వ్యాప్తి!? : తాజా నివేదిక

ప‌రిశోధ‌న‌శాల నుంచి లీక్!

Wuhan Lab
Wuhan Lab

కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి వ్యాపించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చిన విషయం తెలిసిందే. ఇపుతూ వాటిని నిజం చేసేలా తాజాగా ఓ నివేదిక వెలుగు చూసింది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి రూపం దాల్చ‌డానికి ముందు.. వుహాన్ ప‌రిశోధ‌న‌శాల నుంచి లీకైన‌ట్లు తెలుస్తోంది. వైరాల‌జీ ఇన్ స్టిట్యూట్ లో ముగ్గురు ప‌రిశోధ‌కులు 2019 నవంబ‌ర్‌లో ఆస్పత్రుల చుట్టూ తిరిగిన‌ట్లు ఆధారాలు ఉన్నాయి.మ‌హ‌మ్మారిపై చైనా ప్ర‌క‌ట‌న చేయ‌డానికి ముందే.. వుహాన్ ల్యాబ్‌లో ఉన్న సిబ్బంది ఆ వైర‌స్‌తో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైనట్లు గుర్తించారు

. దీనికి సంబంధించిన క‌థ‌నాన్ని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ ప్ర‌చురించింది.గ‌తంలో అమెరికా ఇంటెలిజెన్స్ ఈ నివేదిక‌ను ఇచ్చిన‌ట్లు కూడా తెలుస్తోంది. వుహాన్ ల్యాబ్ నుంచి వైర‌స్ వ్యాప్తి జ‌రిగిన‌ట్లు మొద‌ట్లో అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోప‌ణ‌లు చేసిన సంగతి విదితమే . దీంతో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఇప్ప‌టికే ఓ సారి ద‌ర్యాప్తు చేప‌ట్టింది. క‌రోనా వైర‌స్ స‌హ‌జ‌ సిద్దంగానే జంతువుల నుంచి మ‌నుషుల‌కు సోకిన‌ట్లు పేర్కొన్న‌ది. కానీ ఆ నివేదిక‌పై ప‌లు దేశాలు అనుమానాలు వ్య‌క్తం చేశాయి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/