బారాముల్లాలో ఎన్ కౌంటర్ .. ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్ లోని బారాముల్లాలో నేడు భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పాక్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ వీరమరణం పొందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారాముల్లాలోని క్రీరి ప్రాంతంలో నజీభట్‌ క్రాసింగ్‌ వద్ద ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు, పోలీసుల సంయుక్త బృందం కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి.

ఈ క్రమంలో దాక్కున్న ఉగ్రవాదులు బలగాలను చూసి, వారి పైకి కాల్పులు జరిపాయి. సైన్యం సైతం ప్రతిగా కాల్పులు జరుపడంతో ముగ్గురు హతమయ్యారు. ముగ్గురు పాక్‌కు చెందిన ఉగ్రవాదులని తెలిపారు. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో జేకేపీ జవాన్‌ వీరమరణం పొందారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్‌ ఐజీపీ తెలిపారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, ప్రస్తుతం కూంబింగ్‌, సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుందని వివరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/