ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. బ్యాంక్ రుణాలను మళ్లించిన కేసులో నామా నాగేశ్వరరావుకు సమన్లు జారీ అయ్యాయి. ఇటీవల జరిపిన సోదాల్లో భారీగా దస్త్రాలు, నగదు స్వాధీనం చేసుకుంది. మదుకాన్ కేసులో నిందితులందరికీ సమన్లు జారీ అయ్యాయి. మదుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇటీవల రెండు రోజుల పాటు ఈడీ సోదాలు జరిపింది. సోదాల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. దస్త్రాలు, ఖాతాలు, హార్డ్ డిస్కులను ఈడీ అధికారులు విశ్లేషిస్తున్నారు.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/