మరోసారి చీకోటి ప్రవీణ్కు ఈడీ నోటీసులు
హైదరాబాద్: క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 15న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. క్యాసినో కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై గతంలో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు చీకోటిని ప్రశ్నించిన ఈడీ అధికారులు.. తాజాగా థాయ్లాండ్ ఘటన నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చారు. చీకోటితో పాటు ఈ వ్యవహారంతో సంబంధముందని భావిస్తున్న చిట్టి దేవేందర్, మాధవరెడ్డి, సంపత్కు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి.