సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి నివాసంతో ఈడీ త‌నిఖీలు

ED searches 10 locations including Delhi CM’s secretary’s residence in money laundering case

న్యూఢిల్లీః ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ‌ద్ద ప‌నిచేస్తున్న వ్యక్తిగత కార్యదర్శి నివాసంలో ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ సోదాలు చేస్తోంది. సుమారు 10 ప్ర‌దేశాల్లో ఆ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో లింకు ఉన్న ప్ర‌దేశాల్లోనూ నేడు సోదాలు జ‌రుగుతున్నాయి. మ‌నీల్యాండరింగ్ కేసులో ఈ త‌నిఖీలు జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీ బిబ‌వ్ కుమార్‌తో పాటు ఢిల్లీ జ‌ల బోర్డు స‌భ్యుడు శాలాబ్ కుమార్ ఇండ్ల‌ల్లోనూ ఈడీ ఆఫీస‌ర్లు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలోనే 10 ప్ర‌దేశాల్లో త‌నిఖీలు చేప‌డుతున్నారు.

భారీ స్థాయిలో జ‌రిగిన ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌తో లింకున్న కేసులో ఈడీ తన ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ స‌న్నిహితుల ఇండ్ల‌ల్లోనూ ఈడీ త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది. అధికారుల‌తో పాటు రాజ‌కీయ పార్టీతో లింకున్న కోణంలోనూ విచార‌ణ జ‌రుగుతున్న‌ది.