జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఇంటిపై ఈడీ దాడులు

Hemant Soren
Hemant Soren

రాంచీ: జార్ఖండ్‌​ సీఎం హేమంత్​ సోరెన్​ సహా ఆయన సన్నిహితుల ఇళ్లపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. టెండర్​ స్కామ్​కు సంబంధించి.. సాహెబ్​గంజ్​, బెర్హత్​, రాజ్​మహల్​ సహా మొత్తం 18 ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఈడీ సోదాలు చేస్తోంది. సోరెన్​ ప్రతినిధి పంకజ్​ మిశ్రా నివాసంలోనూ కేంద్ర సంస్థ విస్తృత తనిఖీలు చేపడుతోంది. దాడుల సమయంలో పారామిలిటరీ బలగాల సాయం తీసుకుంది ఈడీ.

కాగా, సీఎం సోరెన్‌పై ఇప్పటికే మైనింగ్‌ కుంభకోణం ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఈడీ గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/