రవిప్రకాశ్పై ఈడీ కేసు నమోదు
అనుమతుల్లేకుండా రూ. 18 కోట్లు విత్డ్రా చేసినట్టు ఆరోపణ
హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న కేసు నమోదు చేసింది. సెప్టెంబరు 2018 నుంచి మే 2019 వరకు రవిప్రకాశ్తో పాటు మరో ఇద్దరు అనుమతుల్లేకుండా రూ. 18 కోట్ల నిధులను విత్డ్రా చేసినట్టు కంపెనీ ప్రతినిధులు గతంలో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబరులో ఈ విషయంలో రవిప్రకాశ్పై కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగానే ఈడీ ఈ కేసు నమోదు చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/