E-వాచ్‌ యాప్‌పై ఏపి హైకోర్టు కీలక ఆదేశం

ఈ నెల 9 వరకు ఈవాచ్ యాప్ ను అమల్లోకి తీసుకురావొద్దని ఎస్ఈసీని ఆదేశించిన హైకోర్టు

అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ, ఫిర్యాదుల కోసం ఏపి ఎన్నికల సంఘం ఈవాచ్ యాప్ ను తీసుకువచ్చింది. అయితే ఈ యాప్ పై వైఎస్‌ఆర్‌సిప సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. ఇది ప్రైవేటు యాప్ అని, తమకు నష్టం కలిగించేందుకే ఈ యాప్ తీసుకువచ్చారని వైఎస్‌ఆర్‌సిపి ఆరోపిస్తోంది. E- మేరకు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, ఏపి హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. వాదనలు విన్న అనంతరం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 9వ తేదీ వరకు ఈవాచ్ యాప్ ను వాడకంలోకి తీసుకురావొద్దని ఎస్ఈసీని ఆదేశించింది. E- యాప్ కు సంబంధించిన సెక్యూరిటీ సర్టిఫికెట్ ఇప్పటివరకు అందలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. సెక్యూరిటీ సర్టిఫికెట్ వచ్చేసరికి మరో 5 రోజులు పడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, న్యాయస్థానం తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.