డబుల్ ఇస్మార్ట్ స్టార్ట్

డాషింగ్ డైరెక్టర్ పూరి – హీరో రామ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. రామ్ కెరియర్ లోనే భారీ హిట్ అయ్యింది. అప్పటి వరకు వరుస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న రామ్ – పూరి లకు ఈ మూవీ ఊపిరి పోసింది. ఈ మూవీ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబో లో సినిమా రాబోతుందని అప్పుడే వార్తలు వచ్చాయి. కానీ సెట్స్ ఫైకి రాలేదు. అప్పటి నుండి అభిమానులు వీరి కాంబో కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక వారి ఎదురుచూపులు తెరపడింది. ఈరోజు హైదరాబాద్ లో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మరోసారి పూరి జగన్నాథ్ చార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ చేసుకుంది. ఈ ప్రాజెక్టు ను గ్రాండ్ గా లాంచ్ చేయగా ఆ ఈవెంట్లో మొదటి షార్ట్ కు ఛార్మి క్లాప్ కొట్టారు. ఇక దర్శకుడు పూరి మొదటి షాట్ కు డైరెక్షన్ చేయగా రామ్ రామ్ పోతినేని “ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్” అనే డైలాగ్ తో ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12వ తేదీ నుంచి మొదలు పెట్టబోతున్నారు. ఇక డబుల్ ఇస్మార్ట్ ఈసారి పాన్ ఇండియా రేంజ్ లోనే తెర పైకి రాబోతోంది. వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసి 2024 మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 8వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.