దేశ పరిస్థితి బాగోలేదు అంత కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చిన మమతాబెనర్జీ

బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మరోసారి బిజెపి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితి ఎంత మాత్రం బాగా లేదని, ఒంటరి రాజకీయాలే ఇందుకు కారణమని అన్నారు. కలకత్తాలోని రైన్- డ్రెంఛ్ద్ రెడ్ రోడ్డులో మంగళవారం జరిగిన ఈద్ ప్రార్థనల్లో మమతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “దేశంలో ప్రస్తుత పరిస్థితి ఏమి బాగోలేదు.విభజించి పాలించే విధానాలు, ఒంటరి రాజకీయాలు ఏమాత్రం సరికాదు..భయపడొద్దు కలసికట్టుగా పోరాడుదాం..అని సీఎం మమతా బెనర్జీ అన్నారు.తాను కానీ, తన పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ప్రజలకు కష్టం కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టదని భరోసా ఇచ్చారు.

మరోపక్క 2024 లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ దేశ ప్రధానిగా పగ్గాలు చేపడతారని, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారని టీఎంపీ ఎంపీ అపురూప పొద్దార్ పేర్కొన్నారు. 2036 లో అభిషేక్ బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ప్రతినిధి కునాల్ ఘోష్ ట్వీట్ చేసిన మరునాడే దానికి అపురూప పొద్దార్ వివరణ ఇచ్చారు. బెంగాల్‌లో మూడోసారి టీఎంసీ అధికారం లోకి వచ్చి ఏడాది ముగిసిన సందర్భంగా కునాల్ ఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు.