మరోసారి దాడి చేస్తే అంతే సంగతి
ఇరాన్ను హెచ్చరించిన ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ అమెరికాపై దాడి చేసింది. అందుకే మేం ప్రతిదాడి చేశాం. మరోసారి ఇరాన్ దాడి చేస్తే మాత్రం అంతే సంగతి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. ఇరాన్ రాజధాని బాగ్దాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా రాకెట్తో దాడి చేసి ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమానిని చంపేసిన విషయం తెలిసిందే. అనంతరం ఇరాన్, ఇరాక్ దేశాలు ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. మరోసారి ఇరాన్ దాడి చేస్తే ఎన్నడూ రుచి చూడనంత తీవ్రమైన దాడితో తిరగబడతాం. ఇరాన్ మరోసారి దాడులకు పాల్పడవద్దని తాను సూచిస్తున్నానని ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/