కరోనా పంజా … కుటుంబం దీనావస్థ

కరోనా బారినపడిన తండ్రి, సోదరుడు ఆసుపత్రిలో చేరిక..ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయిన బాలుడు..తిండిలేక ఆకలితో అలమటించి కన్నుమూత

Chinese-Boy
Chinese-Boy


బీజింగ్‌: కరోనా వైరస్‌ చైనాలో అనేక కుటుంబాలను ఛిన్నాభిన్న చేస్తుంది. ఈనేపథ్యంలో చైనాలో కరోనా వైరస్ బారినపడి తండ్రి, సోదరుడు ఆసుపత్రి పాలవడంతో ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయిన ఓ బాలుడు ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని హుబేయ్ ప్రావిన్స్ కు చెందిన యాన్ జియావెన్ తన ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్నాడు. పెద్ద కుమారుడు యాన్ (17) జన్మతః సెరిబ్రల్ పాల్సీ వ్యాధి వచ్చింది. అతడు వీల్ చెయిర్ కు పరిమితం అయ్యాడు. చిన్నకుమారుడు చెంగ్ (11) ఆటిజంతో బాధపడుతున్నాడు. పిల్లల వైకల్యంతో మనోవేదన చెంది తల్లి ఆత్మహత్య చేసుకుంది. దాంతో జియావెన్ పిల్లలకు అన్నీతానై పెంచుతున్నాడు. అయితే, ఇటీవల జియావెన్ తన చిన్న కుమారుడితో కలిసి వుహాన్ వెళ్లివచ్చాడు. అప్పటినుంచి అస్వస్థతకు గురవడంతో వైద్యపరీక్షలు చేయించగా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. దాంతో ఆ ఇద్దరినీ ప్రత్యేక ఆసుపత్రికి తరలించడంతో పెద్ద కుమారుడు యాన్ ఇంట్లో ఒక్కడే ఉండిపోయాడు. వీల్ చెయిర్ లో ఉంటూ ఎటూ కదల్లేని నిస్సహాయత కారణంగా ఆకలి తీర్చుకోలేక అల్లాడిపోయాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/