పోకోఎక్స్2 స్మార్ట్ఫోన్ లాంచ్
ముంబయి: షావోమి నుంచి విడిపోయిన పోకో తన మొట్టమొదటి స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వేగవంతమైన ప్రాసెసర్తో ఆకట్టుకున్న పోకో ఎక్స్ 1 తరువాత, ఈ సిరీస్లో రెండవ స్మార్ట్ఫోన్ను పోకో ఎక్స్ 2 పేరుతో తీసుకొచ్చింది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న పోకో ఎక్స్ 2 బేస్ వేరియంట్ రూ రూ.15,999 గా ఉంచింది. అలాగే ఎయిర్టెల్ లేదా జియో నెట్వర్క్లో ద్వారా వై ఫై కాలింగ్ సదుపాయాన్ని కూడా ఈ స్మార్ట్ఫోన్లో అందిస్తోంది. పోకో ఎక్స్ 2 అట్లాంటిక్ బ్లూ, మ్యాట్రిక్స్ పర్పుల్ , ఫీనిక్స్ రెడ్ అనే మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. 6.67 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 1080×2380 పిక్సెల్స్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 10, 64+8+2+2 ఎంపీ రియర్ ఎమెరా, 20 +2 ఎంపీ ఎంపీ సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే, క్విడ్ కూలింగ్, యుఎస్బి టైప్సి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, 27 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 960 ఎఫ్పీఎస్లో స్లోమోషన్ వీడియోలను రికార్డింగ్ ఇతర ప్రధానపీచర్లుగా ఉన్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/