నాకు ఆ సత్తా లేదని అనేవాడు ధోని
గత అనుభవాలను గుర్తు చేసుకున్న ఇషాంత్
న్యూఢిల్లీ: కరనా మహామ్మారి కారణంగా ఇళ్లకే పరిమితమయిన క్రికెటర్లు ఆన్లైన్లో అభిమానులతో టచ్లో ఉంటున్నారు. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్స్టార్ జర్నలిస్ట్ గౌరవ్కపూర్ యూట్యూబ్ ఛానల్కు టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో పలు ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోనితో గతంలో జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నాడు. ధోని తనను నువ్వు సిక్సర్లు కొట్టలేవని ఆటపట్టిస్తుండేవాడు. నాకు ఆ సత్తా లేదని అనేవాడు. దీంతో గత ఏడాది ఏడాది ఐపిఎల్లో జడ్డు బౌలింగ్లో వరుసగా 4,6 కొట్టా. దీనికి ధోని రియాక్షన్ ఎలా ఉందో అని అతని వైపు చూశా.. అంతే కెప్టెన్ కూల్ వెంటనే జడ్డూపై ఆగ్రహం వ్యక్తం చేశాడంటూ ఇషాంత్ చెప్పాడు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/