దేవినేని అవినాష్ ఇంటి బయట ఆందోళన
వైఎస్సార్సీపీ నేత, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం నుండి అవినాష్ ఇళ్ల ఫై , ఆఫీస్ లపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయవాడ గుణదలలోని ఇంటి తో పాటూ పలుచోట్లు ఐదు టీమ్లు సోదాలు చేస్తున్నారు.
అవినాష్కు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఓ స్థలం డెవలప్మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్ తీసుకుంది. ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సోదాల్లో కీీలకమైన డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు సమాచారం. రెండు హార్డ్ డిస్కులు తీసుకెళ్లి అందులో కొంత సమాచారాన్ని కాపీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటె అవినాష్ ఇంటి ఫై ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ ఆయన అభిమానులు ఆందోళన చేపట్టారు. కక్షపూరితంగానే అవినాష్ ఇంటిపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఐటీ అధికారులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.