సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్‌లో టపాసులు పేల్చి నానా రచ్చ చేసిన బన్నీ ఫ్యాన్స్

హైదరాబాద్ RTC క్రాస్ రోడ్ లోని సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్‌లో అల్లు అర్జున్ అభిమానులు నానా రచ్చ చేసారు. థియేటర్ లోపలే టపాసులు పేల్చి నానా హంగామా చేసారు. ఇటీవల కాలంలో హీరోల తాలూకా బర్త్ డే రోజున వారు నటించిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్​ ‘ఖుషి’, ‘జల్సా’, మహేశ్ బాబు ‘పోకిరి’, వెంకటేశ్ ‘నారప్ప’, బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’, రామ్ చరణ్ ఆరెంజ్ తదితర చిత్రాలు రీ–రిలీజ్ అయి అభిమానులను అలరించాయి. ఈ క్రమంలో ఇప్పుడు అల్లు అర్జున్ – పూరి కలయికలో 2007 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేశ ముదురు చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు. రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా ఏప్రిల్ 06 న దేశముదురు మూవీ ని రీ రిలీజ్ చేసారు.

ఈ క్రమంలో హైదరాబాద్ లోని RTC క్రాస్ రోడ్ లోని సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్‌లో భారీగా ఫ్యాన్స్ చేరుకొని.. థియేటర్ లోపల టపాసులు పేల్చి నానా రచ్చ చేశారు. దీంతో పోలీసులు వచ్చి షోను ఆపేశారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ (ఎస్‌కేఎన్) ట్వీట్ చేశారు. దయచేసి థియేటర్లలో సీట్లు పాడుచేయొద్దని, క్రాకర్లు పేల్చొద్దని ఫ్యాన్స్‌ను ఆయన రికెస్ట్ చేశారు. దేవాలయాల్లాంటి థియేటర్‌లను రక్షించండి అని కోరారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లోని చాల థియేటర్స్ లలో దేశ ముదురు మూవీ ని రీ రిలీజ్ చేసి అభిమానులను అలరించారు.