ఢిల్లీ, పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లోనే రైతుల మకాం

Delhi, Punjab-Haryana border is the abode of farmers

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతున్నది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ, పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లోనే వారు మకాం వేశారు. కావాల్సిన సరుకు సరంజామా అంతా వెంట తెచ్చుకుని బార్డర్‌లో తిష్టవేశారు. అక్కడే వండుకుతిని గుడారాల్లో తలదాచుకుంటున్నారు.

తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, గత ఆందోళనల సందర్భంగా తమపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. రైతుల డిమాండ్లపై చర్చకు సిద్ధమంటూనే ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తున్నది. గతంలోలా రైతులు రాజధానిలోకి చొచ్చుకురాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పంజాబ్‌-హర్యానా నడుమగల శంభు సరిహద్దులో రైతులు వాహనాలపైనే వంట చేసుకుంటున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.