పార్లమెంట్ ఘటన.. ఆరు రాష్ట్రాలకు దర్యాప్తు బృందాలు

Delhi Police teams in 6 states to probe Parliament security breach

న్యూఢిల్లీః ఇటీవల పార్లమెంట్లో లోక్ సభ సమావేశాలు జరుగుతండగా ఇద్దరు ఆగంతకులు అక్రమంగా చొరబడిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగానికి చెందిన బృందాలు ఆరు రాష్ట్రాలకు బయల్దేరాయి. రాజస్థాన్‌, హరియాణా, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రకు చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపడుతున్నాయి. ఈ బృందాల వెంట నిందితులు కూడా ఉన్నారు. వీరితో పాటు మరో 50 బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. అయితే ఈ 50 బృందాలువి నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలు, పూర్వపరాలను సేకరిస్తున్నాయి.