ఈటల రాజేందర్‌ కు సొంత వాహనమే లేదట..కానీ ఆయన భార్య ఆస్తి మాత్రం రూ. 43 కోట్లు

హుజురాబాద్‌ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది, 43 మంది స్వతంత్రులతో పాటు మొత్తంగా 61 మంది 92 సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. అయితే ఉప ఎన్నికల ఆఫిడివిట్ లో అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలు పేర్కొన్నారు. వీరిలో బిజెపి తరుపున బరిలోకి దిగిన ఈటెల రాజేందర్ ఆస్తుల కంటే ఆయన భార్య ఆస్తుల విలువ ఎక్కువగా ఉంది. ఈయన మొత్తం ఆస్తుల విలువ..16.12 కోట్లు కాగా… చర స్థిర ఆస్తులు..16.12 కోట్లుగా తెలిపారు. కొసమెరుపు ఏంటి అంటే..ఈటల రాజేందర్‌ కు సొంత వాహనము లేదని ఆఫిడవిట్‌ లో పేర్కొన్నారు.

ఇక ఈటెల జమున మొత్తం ఆస్తుల విలువ..రూ. 43 కోట్లు కాగా… డిపాజిట్ లు రూ. 28.68 కోట్లు ఉన్నాయి. అలాగే… స్థిరాస్తులు..రూ14.78 కోట్లు ఉండగా… 1500 గ్రాముల ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే మూడు ఇన్నోవా, సీఆర్వీ వాహనాలు, క్రిస్ట ఉన్నాయి. బలుమూరి వెంకట్ (కాంగ్రెస్ అభ్యర్థి) మొత్తం ఆస్తులు విలువ..59,51,086 కాగా… రూ. 14 లక్షలు విలువ చేసే ఒక సఫారీ స్టార్మ్ కారు, 462 గ్రాముల ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. అలాగే.. గెల్లు శ్రీనివాస్ (టి ఆర్‌ఎస్ అభ్యర్థి) మొత్తం ఆస్తులు విలువ రూ. 22 లక్షలు కాగా.. చర స్థిర ఆస్తులు విలువ రూ. 22,82,402లక్షలు గా ఉంది. గెల్లు శ్రీనివాస్‌ కు సొంత వాహనము లేదు.