మనీష్‌ సిసోడియా కస్టడీ పొడిగింపు

Delhi court extends Manish Sisodia’s judicial custody i

న్యూఢిల్లీః ఆప్‌ నేత, మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఈడీ మనీలాండరింగ్‌ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. దర్యాప్తు కీలక దశలో ఉందని, జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు కస్టడీని పొడిగించింది. మరో వైపు సీబీఐ విచారిస్తున్న ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 12న విచారణ జరుగనున్నది. మద్యం పాలసీ కేసులో ఫిబ్రవరి 26న మనీష్‌ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిది గంటలకుపైగా విచారించిన ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. ఆ తర్వాత ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత సీబీఐ కస్టడీకి ఇచ్చింది. విచారణ అనంతరం ఆయనను జ్యుడీషియల్‌ కస్టడీపై జైలుకు పంపింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటూ వస్తున్నారు.