కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి

టికెట్ ఆశించి భంగపడిన నేతల జంపింగ్‌లు

dccb-chairman-manohar-reddy-quits-brs

హైదరాబాద్‌ః ఎన్నికలకు ముందు తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడిన వారు ఇప్పటికే పలువురు పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ జాబితాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి చేరారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డితో ఇప్పటికే భేటీ అయిన ఆయన తాజాగా పార్టీని వీడారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

ఈరోజు ఉదయం 9 గంటలకు మనోహర్‌రెడ్డి నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ భేటీ జరిగింది. దీనికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ హాజరైనట్టు తెలిసింది. కాగా, కాంగ్రెస్‌లో చేరుతున్న మనోహర్‌రెడ్డికి తాండూరు అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేసినట్టు సమాచారం.