ఓటీటీలోకి వచ్చేసిన కస్టడీ

అక్కినేని అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన కస్టడీ మూవీ ఓటిటిలోకి వచ్చేసింది. నాగచైతన్య, కృతిశెట్టి జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ..జూన్ 09 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు మొదటి ఆటతోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. కథ పెద్దగా లేకపోవడం, స్క్రీన్ ప్లే కూడా అంతంత మాత్రంగా ఉండడం తో ప్రేక్షకులు నిరాశ చెందారు.

ఇక ఈ మూవీ ఓటిటి రైట్స్ దక్కించుకున్న అమెజాన్.. గత అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ లో పెట్టేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. యువన్ శంకర్ రాజా, ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మించాడు.