కవిత జ్యుడీషియల్ కస్టడీని 14 రోజులు పొడిగించిన న్యాయస్థానం

court extended Kavitha judicial custody for 14 days

న్యూఢిల్లీః బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆమె జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. కవిత కస్టడీని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో మే 7వ తేదీ వరకు కవిత తీహార్ జైల్లోనే ఉండనున్నారు. మరోవైపు, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కూడా కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది.

కవితకు జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదంటూ ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని, కేసు విచారణ పురోగతిపై ప్రభావం చూపుతుందని… అందుకే కస్టడీని పొడిగించాలని ఈడీ కోరింది. వాదనల అనంతరం కేసు పురోగతి వివరాలను ఈడీ న్యాయవాది… కోర్టుకు అందించారు. కవిత అరెస్ట్‌పై త్వరలో ఛార్జీషీట్ దాఖలు చేస్తామని తెలిపింది. వాదనలు ముగిసిన అనంతరం కోర్టు కస్టడీని పొడిగించింది.