ఏపిలో కరోనా పంజా.. మరో 62 కొత్త కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,525.. మొత్తం 33 మంది మృతి
అమరావతి: ఏపిలో కరోనా మహమ్మారి తన పంజా విసురుతుంది. గత 24 గంటలో ఏపిలో 5,943 శాంపిళ్లను పరీక్షించగా 62 మందికి కొవిడ్ 19 పాజిటివ్ గా తెలిందని ఏపి వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,525గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 441 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారని వివరించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,051గా ఉందని ఏపి వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్లో తెలిపింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/