ఎంపి ‘మాగుంట’కు కరోనా
తేలికపాటి లక్షణాలున్నాయని వైద్యుల వెల్లడి
Chennai: ఒంగోలు ఎంపి, వైసిపి నాయకుడు మాగుంట శ్రీనివాసులరెడ్డికి కరోనా సోకడంతో ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఇటీవలే లక్షణాలున్నట్లు అనుమా నించడంతో ఆయన వెనువెంటనే పరీక్షలు చేయించుకున్నారు.
ఫలితాల్లో ఆయనకు కొవిడ్ పాజి టివ్ వచ్చింది. ఆయనకు కేవలం తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/