భారత్లో కొత్తగా 97,570 మందికి కరోనా
మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,59,985
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా 97,570 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,59,985కు చేరింది. గత 24 గంటల సమయంలో 1,201 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 77,472కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 36,24,197 మంది కోలుకున్నారు. 9,58,316 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/