భారత్లో కొత్తగా 66,999 పాజిటివ్ కేసులు
మొత్తం కేసులు 23,96,638…మొత్తం మృతుల సంఖ్య 47,033
న్యూఢిల్లీ: భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. దేశంలో 24 గంటల్లో 66,999 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 942 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 23,96,638 కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 47,033 కి పెరిగింది. 6,53,622 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 16,95,982 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,68,45,688 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 8,30,391 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/