కరోనా బారినపడిన వర్షం బ్యూటీ

చిత్రసీమలో కరోనా ఉదృతి ఎక్కువగా నడుస్తుంది. మొన్నటి వరకు కరోనా బారిన ఎక్కువగా పెద్ద ఏజ్ సినీ ప్రముఖులే పడ్డారు. వీరిలో కొంతమంది క్షేమంగా బయటపడగా..మరికొంతమంది మాత్రం కరోనా నుండి బయటపడలేక ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కువ సంఖ్య లో యంగ్ నటి నటులే కరోనా బారినపడుతున్నారు. గత రెండు రోజులుగా అధిక సంఖ్యలో సినీ ప్రముఖులు కరోనా బారినపడుతూ వస్తున్నారు. ఇప్పటివరకు సూపర్ స్టార్ మహేష్ బాబు , వర లక్ష్మి శరత్ కుమార్ , మీనా , థమన్ , మంచు లక్ష్మి మొదలగు వారు కరోనా బారినపడగా..తాజాగా వీరి జాబితాలో నటి త్రిష చేరింది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. ” కరోనా నియమాలు పాటిస్తున్నా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొత్త ఏడాదికి కొంచెం ముందు నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మీకు తెలిసిన అన్ని లక్షణాలు నాకు ఉన్నాయి. అయినా కానీ ఆ వారాలు నాకు చాలా బాధ కలిగించాయి. ప్రస్తుతానికి నేను కోలుకొంటున్నాను.. వాక్సినేషన్ వలన ఈరోజు నేను బావున్నాను. దయచేసి అందరు వాక్సిన్ వేయించుకొని.. మాస్క్ వేసుకోండి. త్వరలోనే మళ్లీ టెస్టులు చేయించుకొని ఇంటికి తిరిగి వస్తాను. నా కోసం ప్రార్దించిన నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్నా అభిమానులు త్రిష త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.