పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిధి అగర్వాల్..వరుడు ఆ హీరోనేనా..?

సవ్యసాచి ఫేమ్ నిధి అగర్వాల్ పెళ్లి పీటలు ఎక్కబోతుందని..అది కూడా తమిళ్ హీరో ను పెళ్లి చేసుకొని ఓ ఇంటిది కాబోతుందనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. సవ్యసాచి మూవీ తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన నిధి అగర్వాల్.. మొదటి సినిమాతోనే భారీ షాక్ తిన్నది. ఈ మూవీ హిట్ కాకపోయినా అమ్మడికి మాత్రం ఛాన్స్ తగ్గలేదు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈమె..ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. అలాగే మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ సరసన హీరో మూవీ లో నటించింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదిలా ఉంటె..ఈ అమ్మడు తమిళ్ హీరో శింబు ను పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్ గా మారాయి. గతంలో నయనతార, హన్సిక‌లతో శింబు ప్రేమయాణాన్ని కొనసాగించారు. అనివార్య కారణాల వల్ల ఆ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లలేకపోయారు. అయితే, మరోసారి అతడు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. నిధి అగర్వాల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈశ్వరన్ సినిమాలో శింబు, నిధి అగర్వాల్ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడినట్టు సమాచారం. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని..ఆ ప్రేమే ఇప్పుడు వీరిద్దరిని పెళ్లి పీటలు ఎక్కించబోతుందని తమిళ్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వీరిద్దరూ కెరీర్ పై ఫోకస్ పెట్టారని, త్వరలోనే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలి.

ఇక శింబు సినిమాల విషయానికి వస్తే…ఈయన హీరోగా నటించిన సినిమా ‘‘ మానాడు’’. టైమ్ లూప్ బేస్‌డ్ థ్రిల్లర్‌గా ఆ చిత్రం తెరకెక్కింది. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఓటీటీలోను దూసుకుపోతోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్, ఎస్ జే. సూర్య కీలక పాత్రల్లో నటించారు.