కరోనా బారినపడిన మణిరత్నం

లెజెండ్రీ డైరెక్ట‌ర్ మణిరత్నం కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బుసలు కొడుతూనే ఉంది. కరోనా వాక్సిన్ లు వేసుకొని , పలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ మహమ్మారి మాత్రం వదలడం లేదు. తాజాగా సినీ డైరెక్టర్ మణిరత్నం కరోనా బారినపడి చెన్నై లోని అపోలో హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన భార్య, నటి సుహాసిని త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. మణి రత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా కోసం పనిచేస్తున్నారు.

లైకా ప్రొడ‌క్ష‌న్‌తో క‌లిసి ఆయ‌న మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమాలో తొలి భాగం సెప్టెంబ‌ర్ 30న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతుంది. రీసెంట్‌గానే పొన్నియ‌న్ సెల్వ‌న్ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యరాయ్‌, కార్తి, త్రిష, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, ప్రభు.. ఇలా చాలా మంది స్టార్లు నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్‌ దీనికి సంగీతం అందిస్తున్నారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా పొన్నియిన్ సెల్వన్ సినిమా రాబోతుంది.