ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సామ్ కు ఆహ్వానం

సమంత కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా సమంత కు ఆహ్వానం అందుకుంది. ఆగస్ట్ 12 నుంచి ఈ వేడుకు మొదలుకానుంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ ఫెస్టివల్ దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. ఈ ఫెస్టివల్‌లో సమంత తన కెరీర్, నటన, పరిశ్రమతో తన అనుబంధం లాంటి విషయాల్ని పంచుకోనుంది.

ఈ సందర్బంగా సమంత మాట్లాడుతూ.. ‘గతేడాది IFFMలో భాగమయ్యాను. ఇప్పుడు భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిధ్యం వహించనుండడం నాకు చాలా గర్వంగా ఉంది. దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. భారతీయ సినిమాల్ని, భారతీయులు, సినీ ప్రేమికులు ఇలా ఇతరులందరినీ ఇలా ఒక్క చోట చేర్చడం అన్నది గొప్ప అనుభూతి’.. అంటూ చెప్పుకొచ్చింది.

ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే..నాగ చైతన్య తో విడిపోయాక పూర్తిగా సినీ కెరియర్ ఫై దృష్టి పెట్టింది. వెబ్ సిరీస్ , లేడీ ఓరియంటెడ్ , ఐటెం సాంగ్ ఇలా ఏ ఛాన్స్ వచ్చిన గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్ డైరెక్షన్లో శాకుంతలం మూవీ పూర్తి చేసింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులకు ముందుకు రానుంది. యశోద , ఖుషి చిత్రాలు సెట్స్ ఫై ఉన్నాయి.