గన్నవరం టీడీపీ ఆఫీస్ లో దొంగతనం చేసిన కానిస్టేబుల్..ఏం ఎత్తుకెళ్లాడో తెలుసా..?

రెండు రోజుల క్రితం గన్నవరం టీడీపీ ఆఫీస్ ను వైస్సార్సీపీ కార్యకర్తలు విధ్వసం చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు..ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫై పలు విమర్శలు చేశారనే కోపంతో..వంశీ అనుచరులు టీడీపీ ఆఫీస్ లోకి వెళ్లి నానా రచ్చ చేసారు. ఆఫీసులో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ దాడితో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ ఆఫీసు ముందు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లో భాగంగా అక్కడికి వచ్చిన ఓ కానిస్టేబుల్ ఆఫీసులోకి వెళ్లి విలువైన వస్తువుల కోసం వెతుకులాట మొదలు పెట్టాడు.

టేబుల్ సొరుగులో ఇయర్ బడ్స్ కనబడడంతో వాటిని పరిశీలిస్తున్నట్లు అటు ఇటు తిరుగుతూ. ఎవరూ గమనించరని అనుకున్నాడో లేక దుండగులపైకి పోతుందిలే అని అనుకున్నాడో కానీ గుట్టుచప్పుడు కాకుండా వాటిని తన జేబులో వేసుకున్నాడు. అయితే, సదరు కానిస్టేబుల్ దొంగతనాన్ని ఆఫీసులోని సీసీటీవీ కెమెరా పట్టిచ్చింది. ఆయనగారి నిర్వాకం మొత్తాన్నీ రికార్డు చేసింది. తాజాగా ఈ వీడియోను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు సదరు కానిస్టేబుల్ ఫై ఏమని చర్య తీసుకుంటారో లేదో చూడాలి.