బండి సంజయ్‌ను తొలగించడంతో బిజెపి గ్రాఫ్‌ పడిపోయిందిః విజయశాంతి

Vijayashanti
Congress Leader Vijayashanti Press Meet

హైదరాబాద్‌ః కాంగ్రెస్‌ నేత విజయశాంతి ఈరోజు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. కెసిఆర్‌ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బిజెపి చెబితే ఆ పార్టీలోకి వెళ్లాను. ఏళ్లు గడచినా ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. ఆధారాలు ఉండి కూడా బిజెపి ఎందుకు చర్యలు తీసుకోలేదు? బిజెపి..బిఆర్ఎస్ పార్టీలు ఒక్కటి అని అర్థం అయ్యిందని…తెర ముందు ఒకటి.. తెర వెనుక ఒకటి మట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. బిజెపి… కార్యకర్తలు.. నాయకులను మోసం చేస్తుందని..నమ్మించి మోసం చేస్తున్నారని ఆగ్రహించారు.

బండి సంజయ్ ని.. మార్చిన తర్వాత బిజెపి గ్రాఫ్ పడిపోయిందని స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ నాటిన విత్తనం బిజెపిలో..సంజయ్ ని మార్చేసిందన్నారు. బిజెపిలో ఉన్న నేత అసైన్డ్ భూములు ఏమయ్యాయి..కేసు ఏమైంది అని ప్రశ్నించారు. ఆలోచించండి…బిజెపి పార్టీని వాళ్లకు వాళ్ళే నాశనం చేసుకున్నారని విమర్శలు చేశారు. నన్ను తిట్టే హక్కు బిజెపి నాయకులకు లేదని స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్‌ ఇచ్చే డబ్బుకోసం పని చేసే వ్యక్తిని కాదన్నారు. అద్వానీ నాకు గురువు.. ఆయన మాకు సంస్కారం నేర్పారని బిజెపి విజయశాంతి నేతలకు చురకలు అంటించారు.