శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. టీపీసీసీ ముఖ్యనేత కుమార్తె మృతి

హైదరాబాద్ శివారులోని శంషాబాద్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో టీపీసీసీ ముఖ్యనేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా (25) మృతి చెందారు. శంషాబాద్‌ పరిధిలోని శాతంరాయి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వస్తుండగా ఈమె ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తానియా మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తాలియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు అంచనా వేస్తున్నారు. తానియా బ్యూటీషియన్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.