హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ పాదయాత్ర

Congress’ Bharat Jodo Yatra enters Hyderabad

హైదరాబాద్‌ః భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శంషాబాద్ నుంచి కాలేజీ విద్యార్థులతో కలిసి నడక సాగిస్తున్నారు. వారితో ముచ్చటిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. శంషాబాద్ వద్ద ఒక విద్యార్థిని భరత నాట్యం చేస్తుందని తెలుసుకొని అక్కడే కొద్దిసేపు ఉండి రాహుల్ గాంధీ నాట్యం తిలకించారు. శంషాబాద్ వద్ద ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. ఆరాంఘర్, బహదూర్ పురా, పురానాపూల్, హుస్సేనీ ఆలం, లాడ్ బజార్, చార్మినార్, మదీన, గాంధీభవన్ మీదుగా నెక్లెస్ రోడ్డుకి చేరుకోనుంది. రాహుల్ గాంధీ రాక కోసం ఆరాంఘర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో అక్కడ బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ… చార్మినార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్న ఈ యాత్రలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అందరూ నడుస్తుండగా అకస్మాత్తుగా ఓ ఆవు యాత్రలోకి దూసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన నేతలు.. చెల్లాచెదురుగా అయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/