షెడ్డులో ఉండబోతున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఒక్కడై..మొదటి నుండి అన్ని చూసుకుంటూ వచ్చి..కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చాడు. రాష్ట్ర మొత్తం ప్రచారం చేసి కార్యకర్తల్లో ఉత్సహం నింపారు. ఇక ఇప్పుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి తన మార్క్ పాలన చూపిస్తూ వస్తున్నాడు. ప్రజా క్షేమమే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు.

ప్రస్తుతం తనకు అధికారిక నివాసం లేనందున..కీలక నిర్ణయం తీసుకున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ప్రాంగణంలో ఖాళీగా ఉన్న ఓ ఎకరం స్థలంలో షెడ్డులో ఉండాలనుకుంటున్నట్టు తెలిపారు. అక్కడ భవనాన్ని నిర్మించాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందని.. అందువల్లనే ఒక షెడ్డును కట్టించుకొని దానినే క్యాంపు ఆఫీస్ గా వాడుకుంటానని తెలిపారు. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక, క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.