కేసీఆర్ మహారాష్ట్ర టూర్ వాయిదా…

CM KCR's Maharashtra tour canceled
CM KCR’s Maharashtra tour canceled

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట్ర లో పర్యటించాల్సి ఉండగా..ఈ పర్యటన రద్దు అయ్యింది. రాలేగావ్ సిద్ది, షిరిడీలో కేసీఆర్ పర్యటిస్తారని గతంలోనే సీఈఓ కార్యాలయం వెల్లడించింది. సీఎంవో ప్రకారం.. మే 26న బెంగళూరు, 27న రాలేగావ్‌ సిద్దిలో కేసీఆర్ పర్యటించాల్సి ఉంది. రాలేగావ్‌ సిద్దిలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో కేసీఆర్ భేటీ కావాల్సి ఉంది. షిర్డీ వెళ్లి సాయిబాబాను కేసీఆర్ దర్శించుకుని హైదరాబాద్‌కు చేరుకుంటారని సీఎంవో గతంలోనే వెల్లడించింది. ఇతర షెడ్యూల్స్ కారణంగా సీఎం రాలేగవ్ సిద్ది, షిరిడీ పర్యటన వాయిదా పడినట్టు తెలుస్తోంది.

మే 27న చేపట్టాల్సిన రాలేగావ్‌ సిద్ది పర్యటనపై అధికారిక సమాచారం లేదు. మరోసారి వెళ్లే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఇక నిన్న కేసీఆర్ బెంగుళూర్ పర్యటనకు వెళ్లి వచ్చారు. మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశమయ్యారు. దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని, కచ్చితమైన మార్పు ఉంటుందని, అది ఎవరూ ఆపలేరని సీఎం కేసీఆర్‌ అన్నారు. రెండు , మూడు నెలల్లో ఒక సంచలన వార్తను చెబుతానని సీఎం కేసీఆర్‌ అన్నారు.