దేశంలో కొత్తగా 27,254 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 3,32,64,175
మొత్తం మృతుల సంఖ్య 4,42,874
corona virus-india
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు 30 వేల లోపు నమోదయ్యాయి. కొత్తగా 27,254 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,32,64,175కి చేరింది. అలాగే, నిన్న 37,687 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనాతో మరో 219 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,42,874కి పెరిగింది.
ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 3,24,47,032 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,74,269 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 53,38,945 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేశారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 74,38,37,643 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/