రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై సిఎం కెసిఆర్ సమీక్ష సమావేశం
హైదరాబాద్ః సిఎం కెసిఆర్ ఈరోజు రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ప్రతిపాదనలపై సీఎం అధికారులతో చర్చిస్తున్నారు. రాష్ట్రం ఈ 9 ఏండ్లలో సాధించిన విజయాలను ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. జూన్ 2న ప్రారంభమై 21 రోజులపాటు కొనసాగనున్న ఉత్సవాల ప్రణాళికను సిద్ధం చేసేందుకు శుక్రవారం సచివాలయంలో మంత్రి హరీశ్రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.