నేడు వజ్రోత్సవాలపై సమీక్ష నిర్వహించనున్న సిఎం కెసిఆర్‌

CM KCR's Maharashtra tour canceled
CM KCR

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ నేడు వజ్రోత్సవాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, విధి విధానాలతోపాటు ఇతర అంశాలపై కే కేశవరావు నేతృత్వంలోని కమిటీతో సీఎం సమావేశమవుతారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది. ఈ చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు వివరాలు అందజేసింది. ఈ క్రమంలో సోమవారం నాటి సమావేశంలో వజ్రోత్సవాల కార్యాచరణకు తుదిరూపు ఇవ్వనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/