సీఎం కేసీఆర్కు అల్సర్ ఉన్నట్లు గుర్తించిన డాక్టర్స్

తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు ఆదివారం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పటల్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్ భార్య శోభ అస్వస్ధతకు గురి కావడం..కేసీఆర్ కు సైతం ఉదయం కడుపునొప్పి రావడం తో ఇద్దరు హాస్పటల్ కు వెళ్లారు. ఆస్పత్రిలో కేసీఆర్‌కు ప్రత్యేక వైద్య బృందం ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో సీఎం కేసీఆర్కు అల్సర్ ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు.

ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐజి హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సీఎం కేసీఆర్ మెడికల్ చెకప్ కోసం ఎప్పుడూ యశోద, నిమ్స్ ఆస్పత్రులకు మాత్రమే వెళ్తుంటారు. అయితే ఈసారి ఏఐజీ హాస్పటల్ కు వెళ్లారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ కు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.