యశోద హాస్పటల్ లో కొత్త ప్రభాకర్ ను పరామర్శించిన కేసీఆర్

మెదక్ ఎంపీ , బిఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ ఫై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఫై ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తి తో దాడి చేసాడు. దీంతో ఆయన్ను హైదరాబాద్ యశోద హాస్పటల్ కు తరలించారు.

ప్రభాకర్‌రెడ్డికి యశోద హాస్పటల్ లో దాదాపు 4 గంటల పాటు సర్జరీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రభాకర్‌రెడ్డి కడుపులో చిన్న పేగుకు 4 చోట్ల గాయాలయ్యాయని, దీంతో కడుపులో రక్తం పేరుకుపోయిందని వివరించారు. అందువల్ల 15 సెంటమీటర్ల మేర కడుపును కోతపెట్టి పేరుకుపోయిన రక్తాన్ని శుభ్రం చేశామని, చిన్నపేగును 10 సెంటీమీటర్ల మేర కట్‌ చేశామని వెల్లడించారు. పది రోజుల పాటు రెస్ట్ అవసరమని తెలిపారు. శుక్రవారం రాత్రి యశోద హాస్పటల్ కు కేసీఆర్ వెళ్లి ప్రభాకర్ ను పరామర్శించారు. కుటుంబ సబ్యులకు ధైర్యం చెప్పి, ఆందోళన పడకండి , పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీష్ రావు తో పాటు పలువురు బిఆర్ఎస్ నేతలు ఉన్నారు.