వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్‌

నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్బంగా ఆయన కుమారుడు , ఏపీ సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్ చేసారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతిఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా.. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది.. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు. అంటూ వైఎస్ ట్వీట్ చేశారు.

ఉదయం నుండి కూడా వైఎస్ఆర్ 74వ జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మ, షర్మిల నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఇవాళ సొంత నియోజకవర్గం పాలేరులో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు.