నేటి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్న సిఎం జగన్
అమరావతిః సిఎం జగన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప జిల్లా పర్యటన లో పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేడు సిఎం జగన్ గోపవరంలో సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్పీఎల్ ప్లాంట్లను ప్రారంభోత్సవం లో పాల్గొంటారు. అనంతరం కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ వైఎస్సార్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్ లైట్లను ప్రారంభించనున్నారు. రాత్రికి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఎస్టేట్లో సిఎం జగన్ బస చేయనున్నారు.