20న బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం జగన్
అమరావతిః ఈ నెల 20న మూలా నక్షత్రం రోజున సిఎం జగన్ బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించి. అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోందని.. ఈ సారి కూడా ఆయనే పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. మూలా నక్షత్రం రోజు అమ్మవారిని లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామని వివరించారు. దానికి తగినట్లు అదనపు కౌంటర్లు, తాగు నీరు, ప్రసాదాలు వంటి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. మొదటి రోజు చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయని.. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.