నేడు ఢిల్లీకి వెళ్లనున్న సిఎం జగన్
రేపు మోడీ, అమిత్ షాలను కలవనున్న జగన్
అమరావతిః సిఎం జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన బయల్దేరుతారు. సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. రేపు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను జగన్ కలవనున్నారు. హుటాహుటిన ఆయన ఢిల్లీకి వెళ్తుండటంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.
గత 14 రోజుల్లో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తుండటం ఇది రెండోసారి. ఈ నెల 16న ఆయన ఢిల్లీకి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలను కూడా పక్కన పెట్టి ఆయన అప్పుడు ఢిల్లీకి వెళ్లారు. 17న మోడీ, అమిత్ షాను కలిశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి చర్చించడానికే ఢిల్లీకి వెళ్లానని జగన్ చెప్పారు. ఇప్పుడు విశాఖలో జీ-20 సదస్సు జరుగుతున్న తరుణంలో ఆ కార్యక్రమాన్ని పక్కనపెట్టి ఢిల్లీకి వెళ్తుండటంపై ఆసక్తి నెలకొంది. జగన్ కు మోడీ, అమిత్ షా ల అపాయింట్ మెంట్లు ఇప్పటికే ఖరారయ్యాయి.