నేడు తిరుపతి జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ నేడు తిరుపతి లో పర్యటించనున్నారు. శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకోనున్నారు. అక్కడ తాజ్‌ హోటల్‌లో శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం రాత్రికి తాడేపల్లి నివాసానికి జగన్ రానున్నారు.

సీఎం జగన్‌ పర్యటన షెడ్యూల్‌ చూస్తే..

సాయంత్రం ఐదు గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు
సాయంత్రం 5.15 గంటల వరకు విమానాశ్రయం వద్ద ప్రజలు నుంచి వినతులు స్వీకరణ
సాయంత్రం 5.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి తాజ్ హోటల్‌కు చేరుకుంటారు.
సాయంత్రం 5.30-5.45 గంటల వరకు శ్రీసిటీ ఎండి రవి సన్నా రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్‌లో వధూవరులను ఆశీర్వదించనున్న సీఎం జగన్
అనంతరం 5.45 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం
సాయంత్రం ఆరు గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.