సీఎం కేసీఆర్‌తో ముగిసిన పీకే భేటీ..

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ల భేటీ ముగిసింది. రెండు రోజుల పాటు ఈ భేటీ జరిగింది. ఆదివారం భేటీ పూర్తికాగానే కేసీఆర్‌తో పాటు పీకే కూడా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లినట్టు సమాచారం. రెండ్రోజులుగా దేశ, రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్‌తో పీకే చర్చలు జరిపారు. జాతీయ రాజకీయాలు, బీజేపీని ఢీకొట్టడంపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ కొనసాగింది.

భవిష్యత్తులో మూడో కూటమి ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ను కూడా కలుపుకుపోవాలనే విషయంపై ఆలోచించాలని కేసీఆర్‌ను ప్రశాంత్ కిషోర్ కోరినట్లు సమాచారం. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కతాటిపై ఉంటేనే ఆ పార్టీని గద్దె దింపాలని పీకే వివరించారు. అలాగే తెలంగాణ లో పీకే టీం సర్వ్ చేసింది. ఆ సర్వ్ రిపోర్ట్స్ ను ముఖ్యమంత్రికి ప్రశాంత్‌ కిషోర్‌ అందజేసినట్లు సమాచారం. ఇక ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయనున్నారు. అలాగే తెలంగాణలో ఐప్యాక్ పని చేస్తుంది.