విజయకాంత్ మృతిపై సిఎం జగన్‌ దిగ్భ్రాంతి

CM Jagan shocked over Vijayakanth death

అమరావతిః సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని వారాలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. కొద్దిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినా, మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. విజయకాంత్ కు తాజాగా కరోనా నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, విజయకాంత్ మృతిపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయకాంత్ కుటుంబానికి, ఆయన అభిమానులకు, డీఎండీకే పార్టీ కార్యకర్తలకు సంతాపం తెలియజేశారు.